ఆకేరు న్యూస్, డెస్క్ : ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ ఈరోజు పార్లమెంట్లో 9వ సారి బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఉదయం 9.30కు రాష్ట్రపతి ముర్మును కలిసిన సీతారామన్ 10 గంటలకు పార్లమెంట్కు చేరుకున్నారు. ప్రధానమంత్రి మోదీ జరిగిన కేబినెట్ భేటీలో బడ్జెట్ కు ఆమోదం తెలిపిన అనంతరం.. 11 గంటలకు లోక్సభలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. వికసిత్ భారత్ కు పెద్దపీట వేసినట్లు వెల్లడించారు.
మధ్యాహ్నం 12.00 వరకు బడ్జెట్లో కొన్ని ముఖ్యాంశాలు:
* ప్రతి జిల్లాలో బాలికల కోసం ప్రత్యేక వసతి గృహం ఏర్పాటు
* 500 కళాశాలల్లో కంటెంట్ క్రియేటర్స్ ల్యాబ్ ఏర్పాటు
* వ్యక్తిగత ఆదాయ పన్ను యథాతథం
* బయో ఫార్మా రంగానికి రూ.10 వేల కోట్లు
* ఏపీ, ఒడిశా, తమిళనాడు, కేరళలో గనుల కారిడార్
* మూడు డెడికేటెడ్ కెమికల్ పార్క్ల నిర్మాణం
* దేశంలో 2 హైటెక్ టెక్నాలజీ రూమ్స్ ఏర్పాటు
* కంటైనర్ నిర్మాణ రంగానికి రూ.10 వేల కోట్లు
* దేశంలో కొత్తగా మూడు కెమికల్ రీసెర్చ్ పార్కులు
* సెమీకండక్టర్ మిషన్ కోసం రూ.40 వేల కోట్లు
* టెక్స్టైల్ రంగం అభివృద్ధికి కొత్త పథకం
* దేశంలో కొత్త మెగా టెక్స్టైల్ పార్కుల ఏర్పాటు
* ఖాదీ, హ్యాండ్లూమ్, హస్తకళల ప్రోత్సాహానికి పథకం
* ఆత్మనిర్భర్ భారత్కు రూ.2 వేల కోట్లు
* SME రంగానికి రూ.10 వేల కోట్లు
……………………………………………………………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
