Chalivendram Station Ghanpur councillor initiative
Published:
Updated: 09 Apr 2026 • 12:30 PM
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్
జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మున్సిపాలిటీ పరిధిలో 14వ వార్డ్ లో లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన చలివేంద్రాన్ని గురువారం కౌన్సిలర్ పెసరు కృష్ణవేణి సారయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మండువేసలు ప్రయాణికుల దాహార్తిని తీర్చేందుకు లైన్స్ క్లబ్ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం హర్షనీయం అన్నారు. ఈ కార్యక్రమంలో జాన్ బన్నీ, గౌరీశెట్టి అనిల్, డాక్టర్ రత్నాకర్ రెడ్డి, మహంకాళి రవీందర్, ఆమంచ మధు, పులి వినయ్ తదితరులు పాల్గొన్నారు.
Report a problem with this news article
Please tell us what is wrong. Your report will be sent to the website team.
