A Mahesh , warangal congress leader dead in Petrol Attack
* పెట్రోల్ దాడిలో గాయపడిన కాంగ్రెస్ నాయకుడి మృతి
* జనగామ నుంచి తిరిగి వరంగల్కు మృతదేహం
అకేరు న్యూస్ వరంగల్ : వరంగల్లోని ఏనుమాములలో అర్ధరాత్రి జరిగిన పెట్రోల్ దాడిలో గాయపడిన కాంగ్రెస్ నాయకుడు అడప మహేష్ మృతి చెందారు. దుండగులు ఒంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించి పరారయ్యారు. తీవ్ర గాయాలతో ఉన్న ఆయనను బంధువులు వరంగల్ ఎంజీఎం హాస్పిటల్కు తరలించారు. , పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తరలింస్తుండగా జనగామ దగ్గర ఆయన మృతి చెందినట్లు సమాచారం.. పోస్ట్ మార్టం నిమిత్తం వరంగల్ కు తీసుకువస్తున్నారు.
* వరంగల్ లో హై అలర్ట్…
హైదరాబాద్ నిమ్స్ కు తరలిస్తుండగా మార్గమధ్యంలో అడప మహేష్ మృతి చెందడంతో ఏనుమాముల ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నది.. ఆ ప్రాంతంలో ఘర్షణలు తలెత్తె అవకాశం ఉన్నందున పోలీసులు పెద్ద ఎత్తున బలగాలు అక్కడికి చేరుకుంటున్నాయి.. శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా పోలీసులు ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నారు..
