El Nino Farming Advisory
* బోర్వెల్స్, బావుల కింద వరి సాగు తగ్గించాలి
– ఏ ఓ వీరభద్రం
* ఎల్ నినోపై మహిళా సమైక్య సంఘాలకు అవగాహన సదస్సు
ఆకేరు న్యూస్, రాయపర్తి:
బోర్వెల్స్ మరియు బావుల కింద నీటి వాడకం ఎక్కువగా ఉండే వరి సాగును తగ్గించి, తక్కువ నీటితో ఎక్కువ లాభాలనిచ్చే ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులు మొగ్గు చూపాలని,పిలుపునిచ్చారు.
స్థానిక శ్రీశక్తి భవన్ ప్రాంగణంలో మహిళా సమైక్య సంఘాల (SERP/IKP) ప్రతినిధులకు “ఎల్నీనో ప్రభావం – వ్యవసాయ రంగంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు” అనే అంశంపై ప్రత్యేక అవగాహన సదస్సు శుక్రవారం నిర్వహించారు.
* ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి గుమ్మడి వీరభద్రం మాట్లాడుతూ..
ఎల్నీనో ప్రభావం: రాబోయే రోజుల్లో ‘ఎల్ నినో’ ప్రభావం కారణంగా ఆగస్టు 20 వ తారీకు వరకు వర్షపాతం తగ్గే సూచనలు ఉన్నాయని, దీనివల్ల భూగర్భ జలాలు గణనీయంగా పడిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
నీటి పొదుపు – ప్రత్యామ్నాయ పంటలు: నీటి లభ్యత తక్కువగా ఉన్న సమయంలో వరి స్థానంలో ఆరుతడి పంటలైన ఆముదం, పెసర, మినుము, కందులు, నువ్వులు మరియు చిరుధాన్యాలు (జొన్నలు, సజ్జలు, రాగులు) సాగు చేయడం ద్వారా నీటిని ఆదా చేయడంతో పాటు మంచి ఆదాయం పొందవచ్చని సూచించారు.
* మహిళా సంఘాల పాత్ర కీలకం
గ్రామీణ ప్రాంతాల్లో మహిళా సంఘాల ద్వారా రైతాంగానికి త్వరితగతిన సమాచారం చేరుతుందని, ప్రతి ఇంటికి, రైతు కుటుంబానికి ఈ సందేశాన్ని తీసుకెళ్లడంలో మహిళా సమైక్య సభ్యులు చొరవ చూపాలని కోరారు.
బిందు, స్ప్రింక్లర్ సేద్యం: పంటలకు నీటి యాజమాన్య పద్ధతులు, బిందు (Drip) మరియు స్ప్రింక్లర్ సేద్యం వాడకంపై రైతులను చైతన్యపరచాలని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో మండల సమాఖ్య అధ్యక్షురాలు, ఐకేపీ (IKP) సిబ్బంది, మండల వ్యవసాయ శాఖ విస్తరణ అధికారులు (AEOలు) మరియు పెద్ద సంఖ్యలో మహిళా సంఘాల ప్రతినిధులు, వివోఏ (VOA)లు పాల్గొన్నారు.
