* 141 ఏళ్లు జైలు శిక్ష
* కేరళలోని మలప్పురం జిల్లాలో ఘటన
ఆకేరున్యూస్, తిరువనంతపురం: ఒక వ్యక్తి సవతి కూతురుపై పలు ఏళ్లుగా అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు. విచారణ జరిపిన ఫాస్ట్ ట్రాక్ కోర్టు నిందితుడికి 141 ఏళ్లు జైలు శిక్ష విధించింది. కేరళలోని మలప్పురం జిల్లాలో ఈ సంఘటన జరిగింది. తమిళనాడుకు చెందిన కుటుంబం పని కోసం కేరళకు వలస వచ్చింది. అయితే 2017 నుంచి 2020 వరకు సవతి తండ్రి సవతి కుమార్తెపై ఆమె తల్లి ఇంట్లో లేనప్పుడు ఆ బాలికపై అత్యాచారం చేసేవాడు. కాగా, బాధిత బాలిక ఈ విషయాన్ని తన స్నేహితురాలికి చెప్పడంతో ఆమె తల్లికి వివరించింది. దీంతో 2021లో ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో తండ్రిని అరెస్ట్ చేశారు. 2022లో బెయిల్పై విడుదలైన ఆ వ్యక్తి సవతి కుమార్తెపై మళ్లీ లైంగిక దాడికి పాల్పడడంతో బాధితురాలి ఫిర్యాదుతో అతడిపై మరో కేసు నమోదైంది. మరోవైపు మంజేరి ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టు ఈ రెండు కేసులపై విచారణ జరిపింది. నవంబర్ 29న జడ్జి అష్రఫ్ ఏఎం తీర్పు ఇచ్చారు. పోక్సో, జువెనైల్ జస్టిస్ చట్టాలతో పాటు ఐపీసీలోని పలు సెక్షన్ల ప్రకారం రెండు కేసుల్లో మొత్తం 141 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష విధించారు.
…………………………………
Please tell us what is wrong. Your report will be sent to the website team.
