Rajavaram Family Condolence Visit
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్:
జనగామ జిల్లా చిల్పూర్ మండలం రాజవరం గ్రామానికి చెందిన యాదనాల మల్లయ్య సోమవారం మరణించగా కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీల నాయకులు మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించారు. మల్లయ్య పార్దివ దేహానికి పూల మాలవేసి నివాళులు అర్పించి కుటుంబానికి మనోధైర్యం చెప్పారు.
* కాంగ్రెస్ నాయకులు
కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు మోటం శ్రీనివాస్, గ్రామ శాఖ అధ్యక్షులు నల్ల ఎల్లయ్య, ఉపాధ్యక్షులు కన్నెబోయిన రవి, చిల్పూర్ దేవస్థాన డైరెక్టర్లు బత్తుల సూర్యనారాయణ, ఎడ్ల యాదగిరి సీనియర్ నాయకులు రావుల రమణ రెడ్డి, బత్తుల దేవదాసు, కనెబోయిన కుమార్ లు ముత్తుడి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
* బిఆర్ఎస్ నాయకులు
జనగామ జిల్లా యువజన నాయకులు కేశిరెడ్డి రాకేష్ రెడ్డి సీనియర్ నాయకులు జనగామ యాదగిరి, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ రంగు హరీష్, గ్రామ సర్పంచ్ మోటం రాజు, మండల నాయకులు పాగల వెంకట్ రెడ్డి, మండల నాయకులు రంగు రవి, యువజన మండల నాయకులు ఎడ్ల రాజేష్, ఉడుత అశోక్ నాయకులు మృతుడి కుటుంబాన్ని ప్రమర్శించారు.
