* గోడ కూలడంతో ముగ్గురు దుర్మరణం
* బిహార్ కూలీలుగా గుర్తింపు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : హైదరాబాద్లోని ఎల్బీనగర్ (Lb Nagar)లో విషాదం చోటుచేసుకుంది. గోడ కూలడంతో ముగ్గురు మృతి చెందారు. మరొకరికి తీవ్రమైన గాయాలయ్యాయి. మృతులను బిహార్ (Bihar) కూలీలుగా గుర్తించారు. సెల్లార్ తవ్వుతుండగా హోటల్ గోడ కూలడంతో ఈ దుర్ఘటన జరిగింది. కొంతమంది కూలీలు కలిసి ఎల్బీనగర్లోని ఓ సెల్లార్ లోపల తవ్వకాల పని కోసం వచ్చారు. అందరూ కలిసి మాట్లాడుకుంటూ పని మొదలు పెట్టారు. అయితే తవ్వకాల పని చేస్తుండగా పైనుండి ఒక్కసారిగా మట్టి దిమ్మలు కూలి అక్కడ పని చేస్తున్న వ్యక్తులపై పడ్డాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన జరిగిన వెంటనే స్థానికులు ఇచ్చిన సమాచారం తో పోలీసులు, ఫైర్ (Fire) సిబ్బంది ఘటన స్థలానికి చేరుకున్నారు. ఒక మృత దేహాన్ని ఫైర్ సిబ్బంది, స్థానిక పోలీసులు వెలికి తీశారు. మృతి చెందిన ముగ్గురు బీహార్ కు చెందినవారుగా పోలీసులు గుర్తించారు. ఇంకా రెండు మృతదేహాలను వెలికి తీసేందుకు ఫైర్ సిబ్బంది, పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు.
………………………………………….