Mamnoor MJP School Food Poisoning
ఆకేరు న్యూస్, వరంగల్: వరంగల్ జిల్లా మామునూరులోని మహాత్మా జ్యోతిబాఫూలే (MJP) గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. పాఠశాలలో వడ్డించిన ఆహారం వికటించి 15 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. బాధితులు వాంతులు, తలనొప్పితో తీవ్రంగా ఇబ్బంది పడటంతో పాఠశాల సిబ్బంది వెంటనే వారిని చికిత్స నిమిత్తం వరంగల్ ఎంజీఎం (MGM) ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం విద్యార్థులకు వైద్యులు అత్యవసర చికిత్స అందిస్తున్నారు.
