* సమ్మక్క హుండీలో యువతి లేఖ!
ఆకేరు న్యూస్,జనగామ: సాధారణంగా జాతరలో భక్తులు ఆరోగ్యం, ఐశ్వర్యం కోరుకుంటారు. కానీ, జనగామ జిల్లాలో జరిగిన సమ్మక్క-సారలమ్మ మినీ జాతరలో ఒక భక్తురాలు తన మనసులోని మాటను నేరుగా అమ్మవార్లకే విన్నవించుకుంది. హుండీలో ఆమె వేసిన లేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.చిల్పూర్ మండలం లింగంపల్లి గ్రామంలో ఇటీవల సమ్మక్క-సారలమ్మ మినీ జాతర ఘనంగా జరిగింది. సోమవారం ఆలయ అధికారులు, కమిటీ సభ్యులు హుండీలోని కానుకలను లెక్కిస్తుండగా ఒక లేఖ ప్రత్యక్షమైంది. ఆ లేఖలో ఒక యువతి “తల్లీ.. నాకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చేలా దీవించు. అలాగే నేను ఇష్టపడిన శ్రీధర్తో నా పెళ్లి జరిగేలా చూడు. ఈ రెండు కోరికలు నెరవేరితే, వచ్చే జాతర నాటికి నా శక్తి మేరకు నీకు బంగారాన్ని మొక్కుగా సమర్పించుకుంటాను” అని ఆ అజ్ఞాత భక్తురాలు తన లేఖలో పేర్కొంది.సాధారణంగా మొక్కులంటే ఎత్తు బెల్లం సమర్పిస్తామని కోరుకుంటారు. కానీ, ఈ యువతి తన కెరీర్ (ప్రభుత్వ ఉద్యోగం) మరియు వ్యక్తిగత జీవితం (ప్రేమించిన వ్యక్తితో వివాహం) రెండింటినీ అమ్మవార్లకే అప్పగించేయడం విశేషం. ఈ లేఖను చూసిన అధికారులు సైతం ఆమె అమాయకత్వానికి, నమ్మకానికి ఆశ్చర్యపోయారు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట కూడా హాట్ టాపిక్ అయింది. “ఆమె నమ్మకం నిజమవ్వాలని, శ్రీధర్తో పెళ్లి జరగాలని” నెటిజన్లు సరదాగా కామెంట్స్ చేస్తున్నారు….
…………………………………………………………………..
Please tell us what is wrong. Your report will be sent to the website team.
