Hanamkonda Attack CCTV Incident
* హనుమకొండ లో మరోదాడి
* సీసీటీవీల్లో రికార్డ్
ఆకేరు న్యూస్, వరంగల్ :
వరంగల్ నగర పరిధిలో ఇటీవల చోటుచేసుకున్న రెండు వేర్వేరు దాడి ఘటనలు నగరంలో శాంతిభద్రతలపై ఆందోళన కలిగిస్తున్నాయి. ఏనుమాముల మార్కెట్ పరిధిలో కాంగ్రెస్ నాయకుడు అడుప మహేశ్పై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటనలో ఆయన చికిత్స పొందుతూ మృతిచెందారు. ఈ కేసులో పోలీసులు రౌడీషీటర్ పత్తి కుమార్, జన్ను మధుతో పాటు మరికొందరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
* మరో దాడి
హనుమకొండ బాలసముద్రంలోని శ్రీనివాస కాలనీలో ఓ వ్యక్తిపై కర్రలు, రాళ్లతో దాడి జరిగిన ఘటన సీసీటీవీలో రికార్డైంది. బాధిత కుటుంబ సభ్యులు గతంలోనే ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. ఈ రెండు ఘటనల నేపథ్యంలో నగరంలో రౌడీయిజం, భూకబ్జాదారుల ఆగడాలపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తూ, శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
——
Please tell us what is wrong. Your report will be sent to the website team.
