Jangaon Electric Shock Death
ఆకేరు న్యూస్, జనగామ:
జనగామ జిల్లా పాలకుర్తి మండలంలో తీవ్ర విషాదకర సంఘటన చోటుచేసుకుంది. బట్టలు ఆరేసేందుకు వెళ్లిన ఒక మహిళ ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్కు గురై ప్రాణాలు కోల్పోయింది.
* స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం…
పాలకుర్తి మండలం శాతపురం గ్రామానికి చెందిన రాగిరి అనిత (38) సోమవారం తన ఇంటి వద్ద ఉతికిన బట్టలను ఆరేసేందుకు దండెం వద్దకు వెళ్ళింది. ఈ క్రమంలో బట్టల దండెంకు ప్రమాదవశాత్తు విద్యుత్ సరఫరా కావడంతో ఆమె తీవ్రమైన కరెంట్ షాక్కు గురైంది. విద్యుత్ ప్రవాహ ధాటికి తీవ్రంగా గాయపడిన అనిత అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది.
కుటుంబసభ్యుల కళ్లముందే ఈ ఘటన జరగడంతో గ్రామంలో తీవ్ర శోకసంద్రం అలుముకుంది. సమాచారం అందుకున్న పాలకుర్తి పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మృతదేహాన్ని పరిశీలించిన అనంతరం కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు.
